Robo: అభిమానులకు స్వీట్ షాక్... '2.ఓ'లో ఐశ్వర్యా రాయ్ కూడా!

  • 2010లో వచ్చిన 'రోబో'కు సీక్వెల్ గా '2.ఓ'
  • చిట్టి గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనున్న ఐశ్వర్యారాయ్
  • నవంబర్ 29న విడుదల కానున్న '2.ఓ'

2010లో రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'రోబో'కు సీక్వెల్ గా రూపుదిద్దుకుని, ఈ సంవత్సరం నవంబర్ 29న విడుదలకు సిద్ధమైన '2.ఓ' సినిమాపై ఇది తాజా అప్ డేట్. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కూడా కనిపిస్తారట. 'రోబో'లో ఐశ్వర్య ప్రేమకోసం ప్రపంచ వినాశనాన్నే తలపెట్టిన చిట్టి, ఇందులోనూ కీలక పాత్ర పోషిస్తుండగా, అతనికి తన గర్ల్ ఫ్రెండ్ ను చూసుకునే అవకాశం ఈ సినిమాలో ఉందట. అందుకోసం ఐశ్వర్యారాయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. దాదాపు రూ. 500 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News