vishal: ఆ సినిమా నేను చేయకపోతే ఎన్టీఆర్ గానీ .. చరణ్ గాని చేసేవారు : విశాల్

  • మా నాన్న వల్లనే 'పందెం కోడి' చేశాను 
  • ఆయన ఆశీస్సుల వల్లనే సీక్వెల్ 
  • కంటెంట్ అందరికీ నచ్చుతుంది

దాదాపు 13 యేళ్ల క్రిందట లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన 'పందెం కోడి' సినిమా ద్వారా వెండితెరకి విశాల్ పరిచయమయ్యాడు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'పందెం కోడి 2' వచ్చేనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది విశాల్ కి 25వ సినిమా కావడం వలన మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ సందర్భంగా విశాల్  మాట్లాడుతూ.. "అప్పట్లో 'పందెం కోడి' సినిమా నేను చేసి ఉండకపోతే ఎన్టీఆర్ గానీ .. చరణ్ గాని చేసేవారు. ఎందుకంటే వాళ్లు ఈ కథ కోసం ఎంతగానో ప్రయత్నించారు. ఈ సినిమాను నాతోనే చేయాలనే మా నాన్న పట్టుదల వల్లనే తొలి సక్సెస్ నాకు దక్కింది. ఆయన ఆశీస్సుల వల్లనే మళ్లీ ఇంత కాలానికి సీక్వెల్ లోను నేనే చేస్తున్నాను. ఈ సినిమా అన్నివర్గాల వారికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.   

More Telugu News