virat kohli: ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి యో-యో టెస్టుకు రెడీ అవుతున్న కోహ్లీ

  • వెన్నునొప్పితో బాధపడుతున్న కోహ్లీ
  • ఆసియా టెస్ట్‌కు దూరం
  • 28న యో-యో టెస్ట్

ఇటీవల కాలంలో క్రికెటర్లు తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి యో-యో టెస్టును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా సారధి కోహ్లీ కూడా ఈ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఈమధ్య కోహ్లీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. తను ఆసియా కప్‌కు దూరమవడానికి ఇది కూడా ఓ కారణమే.

త్వరలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు కోహ్లీ ఈ నెల 28న యో-యో టెస్టుకు హాజరుకానున్నాడు. అయితే ఈ టెస్టులో కోహ్లీ సునాయాసంగా పాసవ్వగలడనే అంచనాలున్నాయి. ఇదిలా ఉంచితే, ఆసియా కప్ కు కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో, జట్టు సారధిగా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఈ టెస్ట్‌లో భారత్ ఫైనల్స్‌కు చేరుకుంది. శుక్రవారం భారత్-బంగ్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

More Telugu News