shimbu: 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ లో కేథరిన్

  • జార్జియాలో పూర్తయిన షూటింగ్ 
  • తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో 
  • నదియా పాత్రలో ఖుష్బూ

ఇటు త్రివిక్రమ్ కెరియర్లోను .. అటు పవన్ కల్యాణ్ కెరియర్లోను 'అత్తారింటికి దారేది' చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. 2013లో వచ్చిన ఈ సినిమాలో సమంత - ప్రణీత కథానాయికలుగా నటించగా, అన్నివర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. సుందర్.సి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పవన్ పాత్రను శింబూ చేస్తున్నాడు.

సమంత పాత్రలో మేఘ ఆకాశ్ .. నదియా పాత్రలో ఖుష్బూ కనిపించనున్నారు. ఇక తెలుగులో ప్రణీత చేసిన పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అనే విషయంపై బాగానే కసరత్తు చేశారు. చివరికి ఈ పాత్ర కోసం కేథరిన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే జార్జియాలో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసిన ఈ సినిమా టీమ్, తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం.     

More Telugu News