sebastian: ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ ఇంట్లో ఐటీ సోదాలు

  • మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు
  • ఏ-2 నిందితుడు సెబాస్టియన్ ఇంట్లో సోదాలు
  • ఐటీ సోదాలపై మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లోని భోపాల్ ఇన్ఫ్రా కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు, ఈ సోదాలకు సంబంధించి టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ సోదాలను చేయిస్తున్నారని విమర్శిస్తున్నారు.

More Telugu News