revanth reddy: రేవంత్ ఇళ్ళలో సోదాలకు, మా పార్టీకి సంబంధం లేదు: టీఆర్ఎస్

  • సోదాలు జరుపుతున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థలు
  • ఈ అంశాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారు
  • రేవంత్ రెడ్డి డ్రామాలు అందరికీ తెలిసినవే

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్న ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేడిని పుట్టించింది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి తెలిపారు. సోదాలు జరుపుతున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థలని... ఆ సోదాలతో తమ ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ఈ అంశాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని... టీఆర్ఎస్ పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రామాలు అందరికీ తెలిసినవే అని ఎద్దేవా చేశారు. నేర చరిత్ర కలిగిన వారు ఏ పార్టీలో ఉన్నా చర్యలు తప్పవని చెప్పారు. ఈరోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News