vijay devarakonda: తమిళ నవల ఆధారంగా రూపొందిన 'నోటా'!

  • విజయ్ దేవరకొండ హీరోగా 'నోటా'
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ 
  • వచ్చేనెల 5వ తేదీన విడుదల

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తమిళ .. తెలుగు భాషల్లో 'నోటా' చిత్రం రూపొందింది. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా .. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది.

షాన్ కురుప్పసామి తమిళంలో రాసిన 'వెట్టాట్టం' అనే నవల విశేషమైన ఆదరణ పొందింది. దాంతో సినిమా నడకకి తగినట్టుగా చిన్నచిన్న మార్పులు చేసి నవలలోని కథా వస్తువును తెరపైకి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలు .. తమిళనాడులోని ప్రస్తుత రాజకీయాలకి సంబంధించిన అంశాలతో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. గతంలో పాప్యులర్ నవలలు .. సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇటీవల కాలంలో మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తూ ఉండటం విశేషం.    

More Telugu News