India: బంగ్లాదేశ్ పై ఓడిపోయిన తరువాత ఆనందిస్తున్న పాకిస్థాన్ అభిమానులు... కారణమిదే!

  • నిన్న బంగ్లా చేతిలో పాక్ ఓటమి
  • భారత్ చేతిలో హ్యాట్రిక్ ఓటమి తప్పిపోయింది
  • సర్ఫరాజ్ ఇక వెళ్లిపోవాలంటున్న ఫ్యాన్స్

ఆసియా కప్ - 2018లో భాగంగా, నిన్న రాత్రి అబూదాబిలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్, సూపర్-4 దశ నుంచి నిష్క్రమించిన వేళ, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు మరోరకంగా ఆనందిస్తున్నారట. తమ దేశపు జట్టు ఇండియాతో హ్యాట్రిక్ పరాజయాలను తప్పించుకుందని, భారత్ తో మరో మ్యాచ్ ఆడి ఓడిపోయి ఇంటికి రావడం కన్నా, బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తక్కువ బాధను కలిగిస్తుందని ఆ దేశ క్రికెట్ ప్రియులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

గ్రూప్ దశలో ఓసారి, సూపర్-4లో మరోసారి పాకిస్థాన్ ను టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. ఇక పాక్ కెప్టెన్ ను విమర్శిస్తున్న వారూ లేకపోలేదు. రోహిత్ శర్మతో సర్ఫరాజ్ అహ్మద్ ను పోలుస్తూ, 95 మ్యాచ్ లు ఆడి, 8 ఫిఫ్టీలు, 2 సెంచరీలు చేసిన వ్యక్తి టీమ్ ను నడిపిస్తే ఇలాగే ఉంటుందని విమర్శిస్తున్నారు. ఆతను కెప్టెన్సీ వదులుకోవాలని సలహాలు ఇస్తున్నారు.

More Telugu News