Uttam Kumar Reddy: ఇంత దారుణమా?: రేవంత్ రెడ్డి ఇళ్లలో సోదాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు!

  • రేవంత్ ఇళ్లపై దాడులపై స్పందించిన ఉత్తమ్
  • బీజేపీతో కలిసి కేసీఆర్ కుట్ర
  • ప్రజలే గుణపాఠం చెబుతారన్న ఉత్తమ్

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లపై ఈ ఉదయం నుంచి జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారుల దాడులను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే, ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

బలంగా ఉన్న తమ ఎమ్మెల్యేల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి కేసీఆర్ ఈ దాడులు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. రాజకీయ కారణాలతో జరుగుతున్న ఈ దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ట్వీట్ పెట్టారు.

More Telugu News