Andhra Pradesh: ఏపీ ఎస్సీ కార్పోరేషన్ ఘనత.. ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకుంది: జూపూడి ప్రభాకర రావు

  • దేశంలో ఈ సర్టిఫికెట్ లభించిన తొలి ఎస్సీ కార్పోరేషన్  
  • ఐఎస్ఓ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది
  • అధికారులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. దేశంలో ఈ సర్టిఫికెట్ లభించిన మొదటి ఎస్సీ కార్పోరేషన్ ఇదే కావడం విశేషం. తాడేపల్లిలోని ఎస్సీ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ సమీక్ష సమావేశంలో ఐఎస్ఓ ప్రతినిధి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్ ని చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, మేనేజింగ్ డైరెక్టర్ విజయ కుమార్ లకు అందజేశారు.

ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం ద్వారా దేశంలో ఏ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ కు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ కు ఐఎస్ఓ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వినూత్న పథకాలు ప్రవేశపెట్టి కార్పోరేషన్ ద్వారా సమర్థవంతంగా ఎస్సీలకు ఆర్థిక సహాయం అందజేసినందుకు ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల అధికారులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు ఆయన అభినందనలు తెలిపారు.

More Telugu News