ys jagan: జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదు కాశీయాత్ర: దేవినేని ఉమ

  • జగన్ తన పాదయాత్రలో ఏ సమస్యనూ ప్రస్తావించట్లేదు
  • వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు
  • జగన్ చేష్టలు భరించలేకనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, జగన్ చేష్టలు భరించలేకనే ఆ పార్టీలోని 23 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిన విషయాన్ని ప్రస్తావించారు. జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదు కాశీయాత్ర అని ఎద్దేవా చేశారు. జగన్ తన పాదయాత్రలో ఏ సమస్యనూ ప్రస్తావించడం లేదని, ఆయన ప్రసంగమంతా చంద్రబాబును తిట్టడం కోసమేనని దేవినేని ఉమ దుమ్మెత్తిపోశారు.

More Telugu News