kondagattu: కొండగట్టులో నారాయణబలి హోమంలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి

  • కొండగట్టు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలి
  • మృతుల కుటుంబీకులకు దైవాశీస్సులు ఉండాలి  
  • ఈ రాష్ట్రానికి మంచి చేకూరాలని కోరుతూ ఈ హోమం

కొండగట్టులో ఇటీవల జరిగిన బస్సు ప్రమాద సంఘటన ఎంతటి విషాదం నింపిందో తెలిసిందే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుతూ కొండగట్టులో నిర్వహించిన నారాయణ బలిహోమంలో పరిపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ప్రేతాత్మ విముక్తి కలగాలని కోరుతూ ఈ హోమం చేస్తున్నట్టు చెప్పారు.

మృతుల కుటుంబీకులకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అకాల మృత్యు దోషం కారణంగా ఈ ప్రాంతానికి ఎటువంటి అరిష్టాలు కలగకూడదని, ఇటువంటి ఘోర విపత్తుల నుంచి ఈ ప్రాంతం బయటపడాలని, అందరికీ శాంతి చేకూరాలని, ఈ రాష్ట్రానికి మంచి చేకూరాలని కోరుతూ నారాయణ బలి హోమం, శాంతి కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు.

ఈ కార్యక్రమాలను బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి బృందం శాస్త్రోక్తంగా నిర్వహించిందని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించానని, ఇలాంటి కార్యక్రమం చేసి వాళ్లకు కడుపు నిండా భోజనం పెడదామని తనకు అనిపించిందని చెప్పారు.

More Telugu News