ram: రామ్ కూడా ఒక హుషారైన పాటను పాడేశాడు!

  • రామ్ హీరోగా లవ్ స్టోరీ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • అక్టోబర్ 18న విడుదల

రామ్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన 'హలో గురు ప్రేమకోసమే' సినిమా, అక్టోబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్.. ప్రణీత కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో రామ్ ఒక హుషారైన పాటను పాడినట్టుగా తెలుస్తోంది. తెరపై రామ్ చాలా హుషారుగా ఉంటాడు .. తాను తెరపై కనపడుతున్నంతసేపు ప్రేక్షకులకి ఎంతమాత్రం బోర్ కొట్టకుండా చూసుకుంటాడు.

అలాంటి రామ్ తో ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఒక పాట పాడించాడట. ఈ పాటను రామ్ తో పాడిస్తేనే బాగుంటుందని భావించిన దేవిశ్రీ, రామ్ ను ఒప్పించి పాడించాడట. రికార్డింగ్ కూడా అయిపోయిందనీ .. పాట చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఈ పాటకు మంచి మార్కులు పడితే .. ఎన్టీఆర్ మాదిరిగానే అడపాదడపా రామ్ తన గొంతును సవరించుకునే అవకాశం వుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రామ్ వున్నాడు.     

More Telugu News