New Delhi: మరో యువకుడితో కనిపించిందని... గర్ల్ ఫ్రెండ్ ని ముక్కలుగా నరికిన యువకుడు!

  • న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఘటన
  • మరో యువకుడితో ప్రియురాలిని చూసిన రిజ్వాన్
  • కత్తితో ముక్కలు చేసి మురుగుకాలువలో పడేసిన వైనం

తన ప్రియురాలు మరో యువకుడితో స్నేహం చేస్తోందన్న ఆగ్రహంతో ఆమెను కత్తితో ముక్కలు ముక్కలుగా నరికిన రిజ్వాన్ ఖాన్ (20) అనే యువకుడు, శరీర భాగాలను మూటకట్టి మురుగు కాలువలో పడేసిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉండే రిజ్వాన్, అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమలో ఉన్నాడు.

ఇటీవల ఆమె మరో యువకుడితో స్నేహంగా ఉంటోందని తెలుసుకున్న రిజ్వాన్ ఆమెతో గొడవపడ్డాడు. ఆపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. శవాన్ని ముక్కలు చేసి రెండు బ్యాగుల్లో కుక్కి, వాటిని బాలాపుల్లా ఫ్లయ్ ఓవర్ కింద ఉండే కాలువలో పడేశాడు. ఆపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగింది చెప్పాడు. కేసు నమోదు చేశామని, రిజ్వాన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News