Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అనుష్క ఇమేజ్ పట్టించుకోదట!
  • డబ్బింగ్ చెబుతానంటున్న మమ్ముట్టి 
  • తెలుగులోకి ఆమిర్ హిందీ సినిమా 
  • కొత్త ఆఫీసు తీసిన బన్నీ

*  'సినిమాల ఎంపికలో ఇమేజ్ లాంటివి పట్టించుకోను' అంటోంది అందాలతార అనుష్క. 'ఇమేజ్, మార్కెట్ వంటివి చూసుకుని సినిమాలు చేయడం నాకు ఇష్టం వుండదు. అలా చూసుకుంటే ఒత్తిడి తప్ప మరో ప్రయోజనం లేదు' అని చెప్పింది అనుష్క.  
*  మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథను 'యాత్ర' పేరిట తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మహి వి. రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి మమ్ముట్టి సొంతంగా డబ్బింగ్ చెప్పనున్నట్టు తెలుస్తోంది.
*  ఆమిర్ ఖాన్ హీరోగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో హిందీలో 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతోంది. 150 కోట్ల బడ్జెట్టుతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేయడానికి నిర్మాతలు నిర్ణయించారు.
*  ఇన్నాళ్లూ తమ గీతా ఆర్ట్స్ ఆఫీసులోనే తన సినిమా పనులను కూడా చూసుకుంటూ వచ్చిన హీరో అల్లు అర్జున్ తాజాగా కొత్త ఆఫీసును తీసుకున్నాడు. హైదరాబాదు, జూబ్లీ హిల్స్ లో ఈ ఆఫీసును ప్రారంభించాడు. ఇక తన సినిమాలకు సంబంధించిన పనులను ఇక్కడి నుంచే చూసుకుంటాడు.

More Telugu News