konda surekha: కొండా దంపతులపై మండిపడ్డ టీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్

  • ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను సురేఖ చదివారు
  • కేసీఆర్, కేటీఆర్ పై సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నా
  • కొండా దంపతులకు మతిభ్రమించింది

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ నేత కొరివి వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ పై సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆమె చదివారని, కొండా దంపతులకు మతిభ్రమించడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొండా దంపతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, టీఆర్ఎస్ లో చేరేందుకు నాడు వాళ్లు తన మేనల్లుడి ద్వారా తన వద్దకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కొండా దంపతులకు రాజకీయంగా పునర్జన్మ నిచ్చింది టీఆర్ఎస్సేనని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కొండా కుటుంబానికి టికెట్ ఇవ్వకపోవడాన్ని ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు.

కొండా దంపతులను తరిమికొట్టాలి

ఉద్యమ ద్రోహులైన కొండా సురేఖ దంపతులను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని టీఆర్ఎస్ నేత బస్వరాజు సారయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏ అభ్యర్థినైతే కేసీఆర్ నిర్ణయిస్తారో, ఆ అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లో ఎలాంటి గ్రూపులు లేవని ఆయన చెప్పారు.

More Telugu News