dhruv: తొలి పారితోషికాన్ని కేరళకి విరాళంగా ఇచ్చేసిన విక్రమ్ తనయుడు ధృవ్!

  • తమిళంలోకి 'అర్జున్ రెడ్డి' రీమేక్ 
  • కథానాయికగా మేఘ 
  • హిట్ ఖాయమంటోన్న విక్రమ్

సీనియర్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు 'ధృవ్' కథానాయకుడిగా 'వర్మ' సినిమాతో తమిళ తెరకి పరిచయమవుతున్నాడు. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన 'అర్జున్ రెడ్డి'కి ఇది రీమేక్. బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్టులుక్ ను .. టీజర్ ను వదిలారు. వీటికి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి హీరోగా అందుకున్న పారితోషికం మొత్తాన్ని చెక్కు రూపంలో, కేరళ వరద బాధితుల కోసం అక్కడి ముఖ్యమంత్రి సహాయ నిధికి 'ధృవ్' విరాళంగా అందజేశాడు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 'ధృవ్' ను అభినందించారు. ఇక ఈ సినిమాలో ధృవ్ జోడీగా బెంగుళూర్ కి చెందిన మోడల్ మేఘ కథానాయికగా నటించింది. హీరోగా ఈ సినిమా ధృవ్ ను నిలబెడుతుందని విక్రమ్ భావిస్తున్నాడు. తెలుగులో మాదిరిగా తమిళంలోను ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.    

More Telugu News