aiadmk: అన్నాడీఎంకే ఆహ్వానపత్రికలో స్టాలిన్, కనిమొళి పేర్లు!

  • ఈనెల 30న ఎంజీఆర్ శతజయంతి ముగింపు వేడుకలు
  • అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామన్న అన్నాడీఎంకే
  • సభలో ప్రసంగించాలనే వారి పేర్లను ముద్రించాం

తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఈనెల 30న అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ శతజయంతి ముగింపు వేడుకలను ఆ పార్టీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రికలో డీఎంకే అధినేత స్టాలిన్, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పేర్లను ముద్రించారు. ఇది తమిళనాట సంచలనం రేకెత్తిస్తోంది.

ఈ అంశంపై మంత్రి, అన్నాడీఎంకే నేత పాండియరాజన్ మాట్లాడుతూ, ఎంజీఆర్ శతజయంతి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని... ఈ కారణంగానే వేడుకలకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అధినేత స్టాలిన్ ను, ఆ పార్టీ ఎంపీ కనిమొళిని ఆహ్వానించామని చెప్పారు. సభలో వారు ప్రసంగించాలనే సదుద్దేశంతోనే వక్తల జాబితాలో వారి పేర్లను ముద్రించామని తెలిపారు. అదే విధంగా దినకరన్ కూడా ప్రసంగించాలనే ఆయన పేరును కూడా ముద్రించామని చెప్పారు. అయితే, ఈ వేడుకల్లో పాల్గొనాలా? వద్దా? అనే నిర్ణయాన్ని మాత్రం వారి అభీష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. 

More Telugu News