komati reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు

  • గాంధీభవన్ లో టీ-పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం
  • రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ
  • ఇరవైనాలుగు గంటల్లోగా సమాధాన మివ్వాలని ఆదేశం 

తెలంగాణ  కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీ-పీసీసీ మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టీ-పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈరోజు సమావేశమైంది. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించింది. మరోసారి ఆయకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది.

పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేసిన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ వ్యాఖ్యలపై ఇరవైనాలుగు గంటల్లోగా సమాధాన మివ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది. కాగా, తొలిసారి జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రాజగోపాల్ రెడ్డి మూడు పేజీల వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ మరోసారి రాజగోపాల్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం.

More Telugu News