bangalore: రోడ్డు ప్రమాదంలో కన్నడ నటులకు గాయాలు!

  • షూటింగ్ ముగించుకుని వస్తుండగా ప్రమాదం
  • కన్నడ నటులు దర్శన్, దేవరాజ్ కు గాయాలు
  • మైసూరులోని ఓ ఆసుపత్రికి తరలింపు

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటుడు దర్శన్, సీనియర్ నటుడు దేవరాజ్ కు గాయాలయ్యాయి. కొన్ని రోజులుగా మైసూర్ లో దర్శన్ కొత్త చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ ముగించుకుని ఈరోజు తెల్లవారుజామున మైసూరు నుంచి బెంగళూరుకు తన ఎస్ యూవీ కారులో దర్శన్ బయలుదేరాడు.

దర్శన్ తో పాటు దేవరాజ్, ప్రజ్వల్ దేవరాజ్, మరో నలుగురు ఈ కారులో ప్రయాణిస్తున్నారు. మైసూరు రింగ్ రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దేవరాజ్ కు స్వల్ప గాయాలు కాగా, దర్శన్ కు చేయి విరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డ వీరిని మైసూరులోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఎవరు నడుపుతున్నారనే విషయం తెలియాల్సి ఉంది. 

More Telugu News