stock market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 536.58 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • నిఫ్టీకి 175.70 పాయింట్ల నష్టం
  • టీసీఎస్, కోల్ ఇండియా తదితర కంపెనీల షేర్లకు లాభం

ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 536.58 పాయింట్లు నష్టపోయి 36,305.02 పాయింట్ల వద్ద, నిఫ్టీ 175.70 పాయింట్ల నష్టంతో 10967.40 పాయింట్ల వద్ద ముగిశాయి. టీసీఎస్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, రిలయన్స్ తదితర కంపెనీల షేర్లు లాభాలు పొందగా; ఇండస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐషర్ మోటార్స్, వొడాఫోన్ ఐడియా, ఎం అండ్ ఎం కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. ఇదిలా ఉండగా, డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.95గా ఉంది.

More Telugu News