ys jagan: మూడు వేల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న వైఎస్ జగన్!

  • కొత్తవలస వద్ద ఈ మైలురాయిని చేరిన జగన్
  • పైలాన్ ను ఆవిష్కరించి..మొక్క నాటిన వైనం
  • కేక్ కట్ చేసిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 3 వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస వద్దకు చేరగానే తన యాత్రలో ఆయన మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా 'ప్రజాసంకల్పయాత్ర 3000 కి.మీ.' పైలాన్ ని జగన్ ఆవిష్కరించి, ఓ మొక్కను నాటారు. అనంతరం, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తీసుకొచ్చిన కేక్ ను కట్ చేసిన జగన్, తన యాత్రను కొనసాగించారు. కాగా, గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయలో జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది.

More Telugu News