balapur: ఎన్నికల వేళ... బాలాపూర్ లడ్డూకు భారీ డిమాండ్... రూ. 16.60 లక్షలు!

  • లడ్డూను దక్కించుకున్న టీ శ్రీనివాస గుప్తా
  • ఆర్యవైశ్య సంఘం నేతగా ఉన్న శ్రీనివాస్
  • 25వ సంవత్సరంలో పాత రికార్డులు బద్దలు

బాలాపూర్ లడ్డూ వేలం గత రికార్డులను దాటేసింది. ఎన్నికలు జరుగుతూ ఉండటంతో లడ్డూకు డిమాండ్ పెరుగగా, గత సంవత్సరం లడ్డూ ధర రూ. 15.50 లక్షలను మించింది. బాలాపూర్ కే చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి తేనేటిపల్లి శ్రీనివాస గుప్తా రూ. 16.60 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూ వేలంలో పన్నాల శ్రీకాంత్ రెడ్డి, కళ్లం మల్లారెడ్డి, కోలన్ రామ్ రెడ్డిల నుంచి శ్రీనివాస్ కు గట్టి పోటీ ఎదురైంది. ఇతరుల కన్నా అధికంగా పాటను పెంచి పాడిన శ్రీనివాస్ కు ఈ సంవత్సరం లడ్డూ దక్కింది. లడ్డూ తనకు సొంతమైన సందర్భంగా బాలాపూర్, ఆంజనేయుని ఆలయం వద్ద ప్రత్యేక అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీనివాస్ వెల్లడించారు. ఆ వెంటనే ఆయన లడ్డూ వేలం నిమిత్తం తాను పాడిన రూ. 16.60 వేలను విగ్రహ కమిటీకి చెల్లించారు.

More Telugu News