sudheer babu: భారీ యాక్షన్ మూవీ చేయాలనుంది: సుధీర్ బాబు

  • 'నన్నుదోచుకుందువటే'కి మంచి రెస్పాన్స్
  • యూత్ నుంచి మంచి మార్కులు  
  • నెక్స్ట్ మూవీగా 'వీర భోగ వసంత రాయలు'

సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'నన్ను దోచుకుందువటే' సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ఏరియా నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కంటెంట్ పరంగా ఈ సినిమాకి పడుతోన్న మార్కులతో సుధీర్ బాబు హ్యాపీగా వున్నాడు. ఇక ఆయన తదుపరి చిత్రంగా 'వీర భోగ వసంత రాయలు' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో సుధీర్ బాబు వున్నాడు. తాజా ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా తరువాత ఒక భారీ యాక్షన్ సినిమా చేయాలని వుంది అని చెప్పాడు. తెలుగులో ఒక బెంచ్ మార్క్ లా నిలిచిపోయేలా ఒక యాక్షన్ మూవీ చేయాలనే కోరిక ఎప్పటినుంచో వుంది. త్వరలోనే ఆ ముచ్చట తీర్చుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News