raviteja: రవితేజ సరసన కథానాయికగా నాభా నటేశ్?

  • నాభా నటేశ్ తాజా చిత్రంగా 'నన్ను దోచుకుందువటే'
  • విడుదలకి సిద్ధంగా వున్న 'అదుగో'
  • వీఐ ఆనంద్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా 'నాభా నటేశ్' పరిచయమైంది. నిన్న థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ అమ్మాయిని తమ సినిమాల్లోకి తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారట. నిజానికి ఈ అమ్మాయి తెలుగులో మొదటి సినిమాగా 'అదుగో' చేసినప్పటికీ, 'నన్నుదోచుకుందువటే' ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా ఈ అమ్మాయికి రవితేజ సినిమా నుంచి ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా దర్శకుడు వీఐ ఆనంద్ ఒక సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నాభా నటేశ్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందనే ఆలోచనలో ఆమె వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.       

More Telugu News