srikanth: శ్రీకాంత్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేశాడంటున్న భార్య శ్రీహర్ష!

  • బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు
  • మత్తుమందున్న కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేశాడు
  • స్నేహితుల కోరిక తీర్చాలని ఒత్తిడి చేసేవాడు

భార్యను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లిపోవడం, ఆమె చేత అక్రమ కేసులు పెట్టించడంతో పాతబస్తీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతని భార్య శ్రీహర్ష ఆడియో క్లిప్ విడుదల చేసింది. శ్రీకాంత్ తనను చాలా టార్చర్ పెట్టేవాడని శ్రీహర్ష తెలిపింది. అతనిది సైకో మెంటాలిటీ అని అతని చేతిలో మోసపోయిన చాలా మంది అమ్మాయిలు తనకు ఫోన్ చేసి చెప్పారని వెల్లడించింది.

అమ్మాయిలను ట్రాప్ లోకి దించి వ్యాపారాలు చేయిస్తాడని వాపోయింది. శ్రీకాంత్ తొలుత తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడనీ, అప్పుడు తాను మెడిసిన్ చదువుతున్నానని శ్రీహర్ష తెలిపింది. పుట్టినరోజు సందర్భంగా ఇంటికి రావాల్సిందిగా శ్రీకాంత్ ఆహ్వానించాడనీ, రాకుంటే చనిపోతానని బెదిరించాడని వెల్లడించింది. దీంతో అతని ఇంటికి వెళ్లానని పేర్కొంది. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయిన తనపై లైంగికదాడికి పాల్పడ్డాడనీ, ఈ సందర్భంగా తన నగ్న చిత్రాలను తీశాడని చెప్పింది. ఆ తర్వాతి రోజు న్యూడ్ ఫొటోలు పంపి తనను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడనీ, పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో కుటుంబం పరువు పోకూడదన్న ఉద్దేశంతో అతను చెప్పినట్లు అన్నీ చేశానని వాపోయింది.

స్నేహితులకు తన నగ్న ఫొటోలను పంపిన శ్రీకాంత్, వారి కోరికను కూడా తీర్చాలని తనపై ఒత్తిడి చేశాడని శ్రీహర్ష తెలిపింది. ఆర్య సమాజ్ లో తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వెల్లడించింది. గతంలోనూ ఇలా కొంతమంది యువతులను శ్రీకాంత్ మోసం చేశాడని ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలను శ్రీకాంత్ తల్లిదండ్రులు ఖండించారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే శ్రీహర్ష అబద్ధాలు చెబుతోందని విమర్శించారు.

తన భార్యను కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోవడంతో పాటు ఆమె ఏడు నెలల గర్భాన్ని తొలగించారన్న ఆవేదనతో పాతబస్తీకి చెందిన శ్రీకాంత్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన ఆత్మహత్యకు భార్య శ్రీహర్ష, ఆమె కుటుంబ సభ్యులే కారణమని శ్రీకాంత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో శ్రీహర్షతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదుచేశారు.

More Telugu News