amithabh: ఫస్టులుక్ తోనే హీట్ పెంచుతోన్న కత్రినా కైఫ్

  • భారీ బడ్జెట్ చిత్రంగా 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'
  • 'సురయ్యా' పాత్రలో ఆసక్తి రేపుతోన్న కత్రినా కైఫ్
  • నవంబర్ 8వ తేదీన భారీస్థాయి విడుదల  

నవలలోని కథా వస్తువును ఆధారంగా చేసుకుని గతంలో చాలా సినిమాలు వచ్చాయి .. అనూహ్యమైన విజయాలను సాధించాయి. అలా 1839లో వచ్చిన 'కన్ఫెషన్స్ ఆఫ్ థగ్' అనే నవల ఆధారంగా 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' అనే చిత్రం రూపొందుతోంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ .. ఆమిర్ ఖాన్ .. కత్రినా ఖైఫ్ .. ఫాతిమా సనా షేక్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే అమితాబ్ .. ఫాతిమా .. ప్రతినాయకుడిగా నటిస్తోన్న లాయిడ్ ఒవెన్ పాత్రలను పరిచయం చేస్తూ ఫస్టులుక్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ 'సురయ్యా' పాత్రలో కనిపించనుంది. ఆ పాత్రకి సంబంధించిన ఆమె ఫస్టులుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కత్రినా మరింత గ్లామరస్ గా కనిపిస్తూ .. కైపెక్కించే చూపులతో కుర్రకారు మతులుపోగొడుతోంది. రేపు ఆమిర్ ఖాన్ ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, దీపావళి కానుకగా నవంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.       

More Telugu News