ntr: ఆ పాత్రకు ఎన్టీఆర్ కరెక్ట్.. అంతే!: దర్శకుడు బాబీ

  • 'జై' పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు 
  • దేవిశ్రీ ప్రసాద్ మరోస్థాయికి తీసుకెళ్లాడు 
  • అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నా     

ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'జై లవకుశ' ఒకటి. క్రితం ఏడాది ఇదే రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విజయవిహారం చేసింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లను వసూలు చేసినట్టు అంచనా. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడు బాబీ స్పందించాడు. 'జై లవకుశ' వచ్చి అప్పుడే ఏడాది అయిందా? అని నాకు ఆశ్చర్యంగా వుంది. తొలి రోజున ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ను నేను ఎప్పటికీ మరిచిపోలేను. 'జై' పాత్రను నేను మలిచిన తీరును ఎంతోమంది అభినందించారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు .. ఆ పాత్రలో ఆయనను తప్ప వేరెవరినీ నేను ఊహించుకోలేను. అంతగా ఆయన ఆ పాత్రలో తన నట విశ్వరూపం చూపించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇంతటి విజయానికి కారకులైన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.        

More Telugu News