apcc: ఈ నెల 24న రాఫెల్ కుంభకోణంపై ఏపీసీసీ నిర‌స‌న‌

  • గ‌వ‌ర్న‌ర్ ద్వారా రాష్ట్ర‌ప‌తికి మెమోరాండం అంద‌జేస్తాం
  • దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్ ’
  • ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌.ఎన్‌.రాజా 

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘రాఫెల్ ’ అని ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (అడ్మిన్) ఎస్‌.ఎన్‌.రాజా పేర్కొన్నారు. ఈ మేర‌కు ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాఫెల్ కుంభకోణానికి వ్యతిరేకంగా ఏపీసీసీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ నెల 24న గ‌వ‌ర్న‌ర్ ద్వారా రాష్ట్ర‌ప‌తికి మెమోరాండం అంద‌జేస్తామని, నిర‌స‌న‌కు సిద్ధమవుతున్నామని అన్నారు. అనంత‌రం ఆంధ్ర‌ర‌త్న‌భ‌వ‌న్‌లో జ‌రిగే ఏపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ర‌ఘువీరారెడ్డి పాల్గొంటార‌ని చెప్పారు.

More Telugu News