Telangana: టీవీ చానెళ్ల బాధ్యులు స్వీయ నియంత్రణ పాటించాలి : తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి

  • హింసాత్మక దృశ్యాలు పదేపదే ప్రసారం చేయడం సరికాదు
  • ‘పరువు హత్య'లు వంటి దృశ్యాలు నేరప్రవృత్తిని ప్రేరేపించే ప్రమాదం ఉంది
  • సమాచారం ఇవ్వడంతోపాటు సమాజ శ్రేయస్సును పట్టించుకోవాలి

టీవీ చానెళ్ల బాధ్యులు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సమాచారం అందించడం ముఖ్యమే అయినా అదే సమయంలో సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలని యాజమాన్యాలను కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల ‘పరువు హత్య’ పేరిట జరిగిన సంఘటనలను కొన్ని చానళ్లు పదేపదే ప్రసారం చేయడాన్ని తప్పుపట్టారు. ఇటువంటి దృశ్యాలు మరింత హింసను ప్రేరేపించే ప్రమాదం ఉందన్నారు. హింసాత్మక దృశ్యాలు పదేపదే ప్రసారం చేయడం కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ నియంత్రణ చట్టంలోని ప్రోగ్రాం కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరించారు. 

More Telugu News