dhruv: 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ గా 'వర్మ' .. ఎల్లుండే ఆడియో రిలీజ్

  • ధృవ్ మొదటి మూవీగా 'వర్మ'
  • నిడివి తగ్గించే ఆలోచన
  • నవంబర్లో సినిమా రిలీజ్    

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' యూత్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అవుతోంది. తమిళంలో విక్రమ్ తనయుడు 'ధృవ్' హీరోగా ఈ సినిమా రూపొందింది. బాలా దర్శకుడిగా ఈ సినిమా నిర్మితమైంది.

రథన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా, ఈ నెల 23వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున 'ధృవ్' పుట్టినరోజు కావడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారు. 'అర్జున్ రెడ్డి' నిడివి 3 గంటల 6 నిమిషాలు అయినప్పటికీ ఎక్కడా బోర్ అనిపించలేదు. అయితే తమిళంలో మాత్రం అంత నిడివి ఉంచడం లేదని తెలుస్తోంది. ధృవ్ కి ఇది ఫస్ట్ సినిమా కావడం వలన ఎక్కడా బోర్ అనిపించకూడదనే ఉద్దేశంతో కొన్ని సన్నివేశాలను కుదించేలా ఉన్నారట. నవంబరులో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.   

More Telugu News