Tamilnadu: పక్కింటి పొలిటీషియన్ తో వివాహేతర బంధం... 150 సవర్ల నగలతో పరారైన వ్యాపారి భార్య!

  • తమిళనాడు, కన్యాకుమారి సమీపంలో ఘటన
  • వ్యాపారి, రాజకీయ నేత మధ్య లావాదేవీలు
  • పరారైన వారి కోసం గాలిస్తున్న పోలీసులు

తన పొరుగున ఉన్న ఓ రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యాపారి భార్య, ఇంట్లోని 150 సవర్ల బంగారు నగలను తీసుకుని అతనితో కలసి పారిపోయిన ఘటన తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో కలకలం రేపింది. మార్తాండం పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, మార్తాండం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి (50) ఫైనాన్స్ కంపెనీని నిర్వహిస్తుండగా, అతనికి భార్య (40), ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

వారింటికి సమీపంలోనే వివాహమై భార్యా, పిల్లలున్న ఓ రాజకీయ పార్టీ ప్రముఖుడు నివాసం ఉంటున్నాడు. వీరిద్దరి మధ్యా వ్యాపారపరమైన లావాదేవీలుండగా, తరచూ కలుసుకునేవాళ్లు. ఈ క్రమంలో వ్యాపారి భార్యతో రాజకీయ నేత వివాహేతర బంధాన్ని పెట్టుకున్నాడు. విషయం తెలిసిన వ్యాపారి వారిని మందలించాడు కూడా. ఈ క్రమంలో బుధవారం నాడు తన ఇంట్లోని 150 సవర్ల బంగారం నగలతో ఆమె అదృశ్యం అయింది. తన ప్రియుడితో కలసి ఆమె పారిపోయినట్టు విచారణలో వెల్లడికాగా, వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News