sudheer babu: చేదు అనుభవాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను: సుధీర్ బాబు

  • ఆరంభంలో తిరస్కారాలు ఎదురయ్యాయి 
  • అందుకే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి
  • ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకం వుంది

సుధీర్ బాబు తన సొంత బ్యానర్లో తనే హీరోగా 'నన్ను దోచుకుందువటే' సినిమా చేశాడు. నాభా నటేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ .. " హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆరంభంలో చేసిన ప్రయత్నాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. బ్యాగ్రౌండ్ వున్న నాకే తిరస్కారాలు ఎదురైతే, ఎన్నో ఆశలతో పరిశ్రమకి వచ్చే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ పరిస్థితి ఏమిటా అనిపించింది.

నేను ఒక పొజీషన్ కి వచ్చాక కొత్తవాళ్లకి అవకాశం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అందువల్లనే ఈ సినిమాతో దర్శకుడిగా ఆర్.ఎస్.నాయుడికి ఛాన్స్ ఇచ్చాను. ఒక పట్టుదల అనేది లేని నిర్మాతల సినిమాలు చేసిన కారణంగా నా సినిమాలు కొన్ని ఆడలేదు. నేను నిర్మాతగా మారడానికి అదో కారణం. ఈ సినిమా నాకు తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందని నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News