Telangana: ముగిసిన ‘కరీంనగర్’ ఎలుగుబంటి రెస్క్యూ ఆపరేషన్!

  • టెలిఫోన్ భవన్ లో దాక్కున్న జంతువు
  • మత్తుమందు ప్రయోగించిన అధికారులు
  • ఏడు గంటలు సాగిన ఆపరేషన్

కరీంనగర్ లోని టెలిఫోన్ భవన్ లోకి ఈ రోజు ఉదయం చొరబడ్డ ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఎలుగుబంటి తొలుత ఎక్కడ దాగుందో గుర్తించారు. అనంతరం మత్తు ఇంజెక్షన్ ప్రయోగించి జంతువును బంధించారు. ఈ ఆపరేషన్ దాదాపు 7 గంటల పాటు కొనసాగింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీన్ని అటవీప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.

More Telugu News