nagarjuna: 'దేవదాస్' నుంచి మనసును తట్టే మరో పాట

  • మల్టీ స్టారర్ గా 'దేవదాస్'
  • ఆకట్టుకుంటోన్న సంగీత సాహిత్యాలు
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

నాగార్జున .. నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'దేవదాస్' సినిమా రూపొందుతోంది. ఆకాంక్ష సింగ్.. రష్మిక మందన కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో .. ఏమో ఏమో ఏమో వెలుగు వాగు నాలో పొంగిందేమో .." అంటూ నాని .. రష్మిక మందనలపై ఈ సాంగ్ సాగుతోంది.

ప్రేమలో పడిన కుర్రాడు .. ఆ ప్రియురాలిని తలచుకుంటూ అనుభూతుల అంచుల మీదుగా జారిపోతూ పాడుకునే పాట ఇది. సిరివెన్నెల పద ప్రయోగాలతో మనసు అలలపై తెరచాప పడవలా తేలే పాట ఇది. మణిశర్మ సంగీతం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఈ పాటను హృదయాలకు చేరవేస్తోంది. మల్టీస్టారర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


More Telugu News