Odisha: వాషింగ్ మెషీన్ లో రూ.30 లక్షల క్యాష్.. షాకైన విజిలెన్స్ అధికారులు!

  • ఒడిశాలోని రాయగఢ లో ఘటన
  • ఐటీడీఏ ఇంజనీర్ ఇంటిపై దాడులు
  • కేసు నమోదు చేసిన అధికారులు

ఒడిశాలోని రాయగఢ జిల్లాలో గుణుపురం ఐటీడీఏ ఇంజనీర్ గగన్ బిహారీపతి ఇంట్లో ఈ రోజు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గగన్ పై పలు అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ రోజు ఉదయం రంగంలోకి దిగారు. గగన్ బిహారీపతి ఇంటితో సహా ఐదు చోట్ల విజిలెన్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎక్కడ చెక్ చేసినా కట్టలకొద్దీ నగదు అధికారులకు లభిస్తోంది.

ఇప్పటివరకూ దాదాపు రూ.కోటి వరకూ స్థిర, చరాస్తులను గుర్తించినట్లు బరంపురం విజిలెన్స్ ఎస్పీ మాయాధర్ తెలిపారు. గగన్ ఇంట్లోని ఓ వాషింగ్ మెషీన్ లో రూ.30 లక్షల నగదు దొరికిందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసును నమోదు చేశామని పేర్కొన్నారు. 

More Telugu News