Hyderabad: శ్రీకాకుళం వెళుతున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు బోల్తా... ఒకరి మృతి, 30 మందికి గాయాలు!

  • హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బయలుదేరిన బస్సు
  • మునగాల సమీపంలో బోల్తా
  • అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం

హైదరాబాద్ నుంచి గత రాత్రి శ్రీకాకుళం బయలుదేరిన శ్రీకృష్ణా ట్రావెల్స్ కు చెందిన బస్సు, మునగాల ప్రాంతంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు పల్టీ కొట్టడంతో తామంతా తీవ్ర ఆందోళనకు గురయ్యామని బస్సులోని ప్రయాణికులు వ్యాఖ్యానించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News