Ramcharan: ఇలాంటి హత్యలపై అసహ్యమేస్తోంది: రామ్ చరణ్

  • ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడం పరువుహత్య అవుతుందా?
  • ప్రణయ్ హత్య నన్ను కలచి వేసింది
  • ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువుహత్యలో ప్రణయ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్పందించాడు. ప్రణయ్ హత్య తనను కలచి వేసిందని చెప్పాడు. ఇలాంటి హత్యలపై అసహ్యమేస్తోందని చెప్పాడు. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడం పరువుహత్య అవుతుందా? అని ప్రశ్నించాడు. ఈ సమాజం ఎటు వెళ్తోందని అన్నాడు. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించాడు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశాడు.

More Telugu News