saina nehwal: 'సైనా' బయోపిక్ కోసం బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నా!: శ్రద్ధా కపూర్

  • బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు రాబట్టిన 'స్త్రీ'
  • ఈ సినిమాలో నటించడం ఓ సవాల్ 
  • సైనా దగ్గర బ్యాడ్మింటన్‌లో శిక్షణ

ఇటీవల 'స్త్రీ' సినిమాతో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడంతో మంచి జోష్ మీదుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఓవైపు ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో నటిస్తూనే.. మరోవైపు ఓ బయోపిక్ కోసం వర్కవుట్స్ చేస్తోంది శ్రద్ధా.

అమూల్ గుప్తె దర్శకత్వంలో... 2017 బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బయోపిక్ బాలీవుడ్‌లో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సైనా పాత్రలో శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది. ఒకవైపు ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో నటిస్తూనే.. మరోవైపు బయోపిక్ కోసం వర్కవుట్ చేస్తోందీ అమ్మడు.

ఈ బయోపిక్‌లో భాగంగా సైనా దగ్గర బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ బయోపిక్ విషయమై తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘‘సైనా జీవితం స్ఫూర్తిదాయకం. ఆమె భారతదేశ ఐకాన్. కాబట్టి ఈ బయోపిక్‌లో నటించడం నాకు సవాలుతో కూడుకున్న పని. చాలా రోజులుగా ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నా’’ అని శ్రద్ధా పేర్కొంది.

More Telugu News