simbu: తమిళంలోకి 'అత్తారింటికి దారేది' .. నదియా పాత్రలో ఖుష్బూ

  • పవన్ మేనత్తగా అదరగొట్టిన నదియా 
  • శింబూకి మేనత్తగా ఖుష్బూ
  • జార్జియాలో జరుగుతోన్న షూటింగ్  

తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం అందాల కథానాయికగా ఖుష్బూకి మంచి పేరుంది. ఆ తరువాత ఆమె ఈ రెండు భాషల్లోను తన వయసుకి తగిన ప్రాముఖ్యత కలిగిన పాత్రలను చేస్తూ వస్తోంది. అలాంటి ఖుష్బూ తాజాగా తమిళంలో ఒక కీలకమైన రోల్ చేస్తోంది. అదే .. 'అత్తారింటికి దారేది' రీమేక్ ఆని పాత్ర.త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దాంతో శింబూ హీరోగా తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. సుందర్.సి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులో పవన్ కల్యాణ్ మేనత్త పాత్రలో నదియా నటించి .. మంచి మార్కులను కొట్టేసింది. నదియా క్రేజ్ ను పెంచేసిన ఈ పాత్రను తమిళంలో ఖుష్బూ చేస్తోంది. తన కెరియర్లోను ఈ పాత్ర చెప్పుకోదగినదిగా నిలుస్తుందని ఖుష్బూ భావిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది .. హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు.         

More Telugu News