ponguleti srinivas reddy: ఎంపీ పొంగులేటి వ్యాపార సంస్థలపై ఐటీ అధికారుల దాడులు

  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాపార సంస్థలపై దాడులు
  • హైదరాబాదులో 6 చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల తనిఖీలు
  • వైసీపీ తరపున గెలుపొంది, టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన స్థలాల్లో హైదరాబాదులో 6 చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో ఉదయం 9 గంటలకు సోదాలను ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాఘవ ఇన్ ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ సోదాల వెనుక ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని... ఇవన్నీ సాధారణ సోదాలేనని ఐటీ అధికారులు తెలిపారు. 2014లో వైసీపీ తరపున ఎంపీగా గెలుపొందిన పొంగులేటి... 2016లో టీఆర్ఎస్ లో చేరారు. 

More Telugu News