samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సమంత వాటాకు మూడు కోట్లు!   
  • రాజశేఖర్ 'కల్కి' కోసం భారీ సెట్
  • సినిమా వదిలేసుకున్న రష్మిక!
  • మణిరత్నం 'నవాబ్' రన్ టైం   

*  ఇటీవల విడుదలైన 'యూ టర్న్' చిత్రానికి సమంత పారితోషికంగా ఏమీ తీసుకోకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ లో వాటా అడిగిందట. ఈ సినిమా బిజినెస్ బాగా జరగడంతో ఆమె వాటాకు గాను 3 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే, ఆమె పారితోషికం ఒక్కో సినిమాకు సుమారు కోటి రూపాయలు వుంటుంది!
*  ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి' చిత్రం కోసం హైదరాబాదు శివార్లలో భారీ సెట్ వేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఇందులో షూటింగ్ చేస్తారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.
*  'గీత గోవిందం' చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న కథానాయిక రష్మిక మందన తన తాజా కన్నడ చిత్రం 'వ్రత' నుంచి బయటకు వచ్చేసింది. ఇందులో తనది నెగటివ్ ఛాయలతో కూడిన పాత్ర కావడంతో, ఈ సమయంలో ఇటువంటిది చేయడం కెరీర్ కి మంచిది కాదన్న ఉద్దేశంతో తను ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేసిందట. తెలుగులో మంచి ఆఫర్లు వస్తుండడంతో ఇక్కడ దృష్టి పెట్టనుంది.
*  మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'నవాబ్' రన్ టైం 2 గంటల 23 నిమిషాలుగా సెట్ చేశారు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రం తమిళ వెర్షన్ సెన్సార్ కూడా పూర్తయింది. త్వరలో తెలుగు వెర్షన్ సెన్సార్ కు వెళుతుంది.

More Telugu News