pranay: నేడు మీడియా ముందుకు ప్రణయ్ హత్యకేసు నిందితులు

  • ఈ నెల 14న ప్రణయ్ హత్య
  • తర్వాతి రోజే నిందితుల అరెస్ట్
  • నేటి మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ముందుకు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితులను నేడు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిందితులను మీడియా ఎదుటకు తీసుకు రానున్నట్టు నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

ఈ నెల 14న ప్రణయ్ హత్య జరిగింది. భార్యను ఆసుపత్రిలో చూపించుకుని బయటకు వస్తుండగా, అక్కడే మాటు వేసిన నిందితుడు వెనక నుంచి వచ్చి ప్రణయ్‌ను కత్తితో నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన అమృత తండ్రి మారుతీరావును, ఆయన సోదరుడిని పోలీసులు ఆ తర్వాతి రోజు అదుపులోకి తీసుకున్నారు. తన కుమార్తెపై ప్రేమతోనే ప్రణయ్‌ను చంపించానని మారుతీరావు చెప్పడం గమనార్హం.

More Telugu News