raviteja: 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రిలీజ్ వాయిదా?

  • ముగింపు దశలో రవితేజ మూవీ 
  • కథానాయికగా ఇలియానా 
  • అక్టోబర్ 14వ తేదీన విడుదల  

శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ అంటోని' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన కథానాయికగా ఇలియానా నటిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదట.

కొన్ని కారణాల వలన ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనను విరమించుకున్నారని సమాచారం. డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఒక్కసారిగా ఈ సినిమా రెండు నెలల పాటు వాయిదా పడటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. దసరా రోజుల్లో వస్తోన్న సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్. ఏదేమైనా ఈ వార్త రవితేజ అభిమానులకు నిరాశను కలించేదేనని చెప్పుకోవాలి.   

More Telugu News