chiranjeevi: 50 కోట్ల ఖర్చుతో జార్జియాలో 'సైరా' యుద్ధం

  • జార్జియాలో 20 రోజులపాటు షూటింగ్ 
  • వేల సంఖ్యలో విదేశీ జూనియర్ ఆర్టిస్టులు 
  • వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు    

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు 'జార్జియా'లో జరుగుతోంది. శనివారం రోజున అక్కడ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దాదాపు 20 రోజుల పాటు అక్కడ భారీస్థాయిలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జార్జియాలోని సువిశాలమైన ప్రాంతంలో ఈ యుద్ధ సన్నివేశాలను ప్లాన్ చేశారు.వందలాది గుర్రాలతో వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అక్కడ చిత్రీకరించే ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి కథ కావడం వలన విదేశీ ఆర్టిస్టులు పెద్దసంఖ్యలో అవసరం కావడంతో అక్కడ ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోని ముఖ్య పాత్రధారులంతా కూడా ఈ షెడ్యూల్ షూటింగులో పాల్గొంటున్నారు. అందువలన కేవలం ఈ ఒక్క షెడ్యూల్ కోసమే 50 కోట్ల వరకూ ఖర్చు అవుతోందని చెబుతున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News