Telangana: పెళ్లికి ఒప్పుకోని పెద్దలు.. మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య!

  • తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘటన
  • కిరోసిన్ పోసుకుని ప్రియురాలి ఆత్మహత్య
  • ఉరి వేసుకుని ప్రియుడి మృతి 

ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకోగా, ప్రియురాలి మరణవార్త తెలిసిన యువకుడు తట్టుకోలేక ఉరి వేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లిలో చోటుచేసుకుంది.

శంకర్ పల్లిలోని టంగుటూరులో ఉన్న ఎల్లేశ్, అదే ప్రాంతానికి చెందిన లావణ్య ప్రేమించుకున్నారు. అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన యువతి లావణ్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ చనిపోయింది.

ప్రియురాలు చనిపోయిన వార్త తెలుసుకున్న ఎల్లేశ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుల మరణంతో టంగుటూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.

More Telugu News