Nalgonda District: ప్రణయ్ హత్య కేసులో మరో మలుపు... నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీమ్ అరెస్ట్!

  • ఉదయం నుంచి కరీమ్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు
  • సుపారీ మాట్లాడటం, హంతకుల ఏర్పాటు కరీమ్ ఆధ్వర్యంలోనే
  • కేసును మరింత లోతుగా విచారిస్తున్నామన్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన మిర్యాలగూడ పరువు హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మరో నిందితుడిగా కాంగ్రెస్ నేత ఎండీ కరీమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కరీమ్, ప్రణయ్ ని హత్య చేయించేందుకు మారుతీరావుకు సహకరించాడని పోలీసులు భావిస్తున్నారు.

ఈ మేరకు కరీమ్ ను ఉదయం నుంచి పోలీసులు విచారిస్తున్నారు. అల్లుడిని హత్య చేయాలని మారుతీరావు నిర్ణయించుకున్న తరువాత, మిగతా కథంతా కరీమ్ నడిపించినట్టు తెలుస్తోంది. సుపారీ మాట్లాడటం నుంచి హంతకుల ఏర్పాటు వరకూ ఇతని పర్యవేక్షణలోనే జరిగినట్టు సమాచారం. కాగా, ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని, నేడో, రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసు అధికారులు వెల్లడించారు. 

More Telugu News