kamalesh sahoo: తన ప్రేమను అంగీకరించడం లేదన్న కసితో.. దారుణంగా హత్య చేశాడు!

  • ఇంటర్ వరకూ కలిసి చదువుకున్న కమలేష్, సుప్రియ
  • చెయ్యి కోసుకుని మరీ సుప్రియ ప్రేమను గెలుచుకునే యత్నం
  • మరొరికతో సన్నిహితంగా ఉంటోందనే కోపంతో హత్య

వన్ సైడ్ లవ్ అన్నది ఒక్కోసారి ఎంతటి దారుణానికి ఒడిగడుతుందో తెలిపే సంఘటన ఇది. తనను ప్రేమించాలంటూ ఓ యువతిని ఎన్నిసార్లు అర్థించినా... ఒప్పుకోకుండా మరొకరితో సన్నిహితంగా ఉంటోందనే కారణంతో ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. మొత్తం 38 సార్లు కత్తితో పొడిచి ఆమె ప్రాణాలు తీశాడు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కమలేష్ సాహూ, సుప్రియా జైన్ ఇంటర్ వరకూ కలిసి చదువుకున్నారు. 6 ఏళ్లుగా కమలేష్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో అతను తన చెయ్యి కోసుకుని మరీ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. కానీ సుప్రియ అతని ప్రేమకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఆమె పైచదువుల కోసం ఇండోర్ వెళ్లింది.

ఫేస్‌బుక్ ద్వారా ఆమె ఎక్కడుందో తెలుసుకున్న కమలేష్.. ఇండోర్ వెళ్లాడు. అక్కడ సుప్రియ మరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి భరించలేకపోయాడు. గురువారం రాత్రి ఒంటరిగా వెళుతున్న సుప్రియపై కత్తితో దాడి చేశాడు. ముఖంతో పాటు ఆమె ఇతర శరీర భాగాలపై 38 సార్లు కత్తితో దాడి చేశాడని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కమలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సుప్రియను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

More Telugu News