school bus: చిన్నారిని చిదిమేసిన స్కూలు బస్సు.. సూర్యాపేటలో దారుణం!

  • ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన బాలుడు
  • వేగంగా వచ్చి ఢీకొట్టిన బస్సు
  • ఘటనాస్థలి నుంచి పరారైన డ్రైవర్

ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన ఓ పిల్లాడిని స్కూలు బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని యతిరాజపురం తాండాలో ఈ రోజు చోటుచేసుకుంది.

మేళ్లచెరువు మండలం యతిరాజపురం తాండాకు చెందిన పిల్లాడు(4) ఆడుకుంటూ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాడు. ఇది గమనించని సాయి విద్యానికేతిన్ స్కూలుకు చెందిన బస్సును డ్రైవర్ వేగంగా నడిపాడు. దీంతో చిన్నారిని బస్సు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో అల్లంతదూరంలో ఎరిగిపడ్డ పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. చిన్నారి చనిపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సుకు ఫిట్ నెస్ లేదనీ, అందువల్లే ప్రమాదం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News