komati reddy: కోమటిరెడ్డి సోదరులతో రాహుల్ సీక్రెట్ మీటింగ్!

  • భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • పార్టీ పరిస్థితిని వివరించిన సోదరులు
  • విధేయులకే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి

తెలంగాణ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఈ రోజు టీ-కాంగ్రెస్ నేతలతో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై రాహుల్ నేతలతో చర్చించారు. ఈ భేటీలో టీ-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్, డీకే ఆరుణ, కోమటి రెడ్డి సోదరులు, మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ తో 15 నిమిషాల పాటు రహస్యంగా సమావేశమయ్యారు. తెలంగాణలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని రాహుల్ అడిగి తెలుసుకున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికీ, యువకులకు టికెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు ఈ సందర్భంగా రాహుల్ ను కోరారని సమాచారం. దీనికి రాహుల్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

More Telugu News